మహిళాభ్యుదయంతోనే దేశాభివృద్ధి: డాక్టర్ కందుల నాగరాజు

విశాఖ దక్షిణం, మహిళాభ్యుదయంతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. నియోజకవర్గంలో మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకునేందుకు జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భవనాన్ని డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్నింట ముందు ఉంటున్నారని చెప్పారు. ఏ రంగంలో అయినా సరే పురుషులకు తీసిపోకుండా ముందుకు దూసుకు వెళ్తున్నారని కొనియాడారు. చివరకు అంతరిక్షంలో కూడా కాలు పెట్టారని ప్రశంసించారు. జన శిక్షణ సంస్థాన్ ద్వారా ఎంతో మంది మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుని వారి కుటుంబాలలో వెలుగును నింపారని చెప్పారు. ఈ సందర్భంగా ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థాన్ విశాఖపట్నం అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.ఎల్.మనోహర్ రావు, టైలరింగ్ రిసోర్స్ పర్సన్ సిహెచ్. వనజ, ఫీల్డ్ అసిస్టెంట్ టి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.