రైతులు,కేంద్రం మధ్య మరోసారి చర్చలు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నేటితో రైతుల ఆందోళనలు 40వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఇవాళ విజ్ఞాన్ భవన్‌లో ఏడోసారి రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయి. 40 రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాష్ వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత లాంటి కీలకాంశాలపై చర్చించనున్నారు.

కాగా, గతంలో జరిగిన చర్చల్లో రెండు అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయానికి కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అటు వ్యవసయ చట్టాల్లోని అభ్యంతరాలపై అంశాల వారీగా చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే నేటి చర్చలు సఫలం అవుతాయని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేయాలని ఇప్పటికే రైతుల సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. కాగా, కేంద్రం, రైతుల మధ్య జరిగిన ఏడో విడత చర్చల్లో కూడా ఇరు వర్గాల మధ్య ఎలాంటి స్పష్టత రాలేదు. తిరిగి శుక్రవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.