స్పైస్‌జెట్‌ బంపర్‌ ఆఫర్‌.. EMIతో విమాన టిక్కెట్లు!

 భారత్‌లో విమాన ప్రయాణం సామాన్యులకు ఇప్పటికీ ఓ కలే. అధిక ఛార్జీలే అందుకు కారణం. అయితే, అలాంటి వారి కలలను నిజం చేయడం కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది.

విమాన టిక్కెట్ల ధరలను సులభ వాయిదాల పద్ధతి(ఈఎంఐ)లో చెల్లించేందుకు అనుమతించనుంది. మొత్తం మూడు, ఆరు, 12 నెలల వ్యవధితో ఈఎంఐలు చెల్లించే ఆప్షన్‌ ఇవ్వనుంది.

ఈ ఆఫర్‌ను ఉపయోగించాలనుకునేవారు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ధ్రువీకరణ నిమిత్తం శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌), ఆధార్‌, వీఐడీ వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాతి ఈఎంఐలు అదే యూపీఐ నుంచి డిడక్ట్‌ అవుతాయి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.