నిహారిక నిశ్చితార్థ వేడుక

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం చైతన్య తో గురువారం సాయంత్రం వారి స్వగృహంలో జరిగింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులతో పాటు సాయి ధరమ్ తేజ్ వంటి కొంత మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక నిశ్చితార్ధం ఎంతో సింపుల్‌గా జరిగింది. వేద పండితులు ఈ నిశ్చితార్ధపు తంతును శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు తాంబూలాలు మార్చుకున్నారు.

మెగా కుటుంబానికి ఎప్పటినుంచో స్నేహసంబంధాలు ఉన్న గుంటూరుకు చెందిన పోలీస్ అధికారి కుమారుడే చైతన్య. ఇప్పటికే నిహారికతో అతడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.