Nellore: హోరు వానలో సైతం తగ్గని ప్రచార జోరు

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో జోరువానలో సైతం 27వ డివిజన్లో జనసేన అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మరియు జనసేన సిటీ నాయకుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు 15వ డివిజన్ లో శ్రీమతి పసుపులేటి రజని, 10 వ డివిజన్ లో వెంకటేష్ లను గెలిపించాల్సిఇందిగా ప్రతి గడపకు జరిగే ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తిగా అప్రజాస్వామికంగా జరుగుతున్న ఎన్నికలను చూసి వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి, కోట్ల రూపాయల ఎరచూపి స్థానిక ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ సొమ్ము దుబారా చేసే బదులు కార్పొరేటర్ పదవి కూడా నామినేటెడ్ పదవుల మాదిరి పంచుకోండి అని ప్రతిపక్ష పార్టీని విమర్శించారు. కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న కార్పొరేట్ పదవులతో ప్రజల యోగక్షేమాలు ఎలా చూస్తారు ఆలోచించవలసినదిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధి పరచాలంటే నిస్వార్థంగా ప్రజల పక్షాన నిలబడే జనసేన అభ్యర్థులను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు.