తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడిని ఖండించిన నేమూరీ శంకర్ గౌడ్

హైదరాబాద్, ప్రముఖ మీడియా మిత్రులు, రాజకీయ నాయకులు తీన్మార్ మల్లన్న ‘క్యూ’ న్యూస్ ఆఫీసుపై దాడి అప్రజాస్వామికం. దీనిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరీ శంకర్ గౌడ్ అన్నారు.