టీం పిడికిలి పోస్టర్లను ఆవిష్కరించిన కొత్తచెరువు జనసేన

పుట్టపర్తి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అండగా తలపెట్టిన రైతు భరోసా యాత్రకు మద్దతుగా టీం పిడికిలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన ఆటోస్టికర్లు మరియు వాల్ పోస్టర్లు పుట్టపర్తి నియోజవర్గం కొత్తచెరువులో మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆవిష్కరించి ప్రజలకు తెలియపరచే విధంగా ఆటోలకు అతికించడం జరిగింది. జనసేన రైతు భరోసా యాత్రకు ప్రజల నుండి వస్తున్న స్పందనను ప్రజలకు చేరువ కాకుండా ఈ అధికార పక్షం కుటిల రాజకీయాలు చేస్తూ విమర్శలు చేస్తోంది వాటిని ఇప్పుడు తిప్పికొట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా చేపట్టడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూల వెంకటేష్, పసుపులేటి సూర్యనారాయణ, డి. నరేంద్ర, నిజాం వలి, సల్లప్ప, పూల రెడ్డప్ప, కిరణ్, రమేష్, చాంద్ భాష, కుల్లాయప్ప, రాధాకృష్ణ, ప్రవీణ్, రఘు తదితరులు పాల్గొన్నారు.