ఏలూరులో జనసేన పార్టీలోకి వంద మంది విద్యార్థుల చేరిక

ఏలూరు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి, ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వంద మంది విద్యార్థులు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇంచార్జీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రశ్నించే స్ధాయి నుండి పాలించే స్థాయికి వెళ్తుందని దానికి నిదర్శనమే ఈరోజు వంద మంది విద్యార్థులు జనసేన పార్టీలో చేరడమేనని ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.