మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లాగా కాకినాడను ప్రకటించాలని కందుల దుర్గేష్ కు వినతిపత్రం

తూర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ని కలిసి మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లాగా కాకినాడను ప్రకటించాలని, జనసేన పార్టీలో ఉన్నటువంటి అగ్నికులక్షత్రియులు ప్రసంగి ఆదినారాయణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఏసి సభ్యులు పంతం నానాజి, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, ఆకులు ప్రవీణ్, అగ్నికులక్షత్రియ నాయకులు పాల్గొన్నారు.