జనసేనానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే వ్యక్తిగత విమర్శలు

ఎమ్మిగనూరు: జనసేన పార్టీ స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ మరియు మండల అధికారి ప్రతినిధి రాహుల్ సాగర్ మాట్లాడుతూ.. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసిపి నాయకులు మంత్రులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి సమయం వెచ్చిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసిపి నాయకులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంది ప్రజా సేవ చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి అని గుర్తు చేశారు. అదేవిధంగా పనులు చేపట్టిన శాఖ మీద అవగాహన లేని మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉందని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో పెట్టే శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం పైన అదే విధంగా వారికి కేటాయించిన శాఖ మీద పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అదే తరహా ఘాటైన విమర్శలు రాబోయే రోజుల్లో ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, షబ్బీర్, వినయ్, ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.