అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయమందించిన గురజాల జనసేన

రాజుపాలెం మండలం, పెద నెమలిపురి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి మల్లికార్జునరావు మొలలతో బాధపడుతూ.. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడటం గురజాల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి గురజాల నియోజకవర్గం జనసేన పార్టీ తరపున 5000/- ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కటకం అంకారావు, జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాసిం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల శ్రీను, గురుసాల ప్రసాద్, మట్టం పరమేష్, షేక్ వలి, తదితరులు పాల్గొన్నారు.