సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న డి.ఎం.ఆర్ శేఖర్

  • మనఊరు మనఆట

అమలాపురం: సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పి.గన్నవరం నియోజవర్గం మాచవరం గ్రామ యువత నిర్వహిస్తున్న “అంబేడ్కర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ” ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని జనసేన పార్టీ పార్లమెంట్ ఇంఛార్జి డి.ఎం.ఆర్ శేఖర్ క్రీడాకారులను ఉద్దేశించి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ క్రీడాకారులో నైపుణ్యత కలిగిన క్రీడాకారులకు ఆర్థిక భరోసా వారికి కావలసిన సదుపాయాలు కల్పించి జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని శేఖర్ అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వర రావు, మండలాద్యక్షులు దొమ్మేటి సాయి కృష్ణ, సర్పంచ్ శ్రీమతి శాంతి కుమారి సుబ్బారావు, వార్డు మెంబర్ కుసుమ విజయ కుమారి మరియు ఎంపీటీసీ, లింగోలు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, వర్రే శేషు మరియు యువత పాల్గొన్నారు.