టీమ్ పిడికిలి పోస్టర్లు ఆవిష్కరించిన పాణ్యం జనసేన

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, ఎన్నారై జనసేన నాయకుడు రాజా మైలవరపు ఆధ్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందించిన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పంపిణీ చేయటానికి పంపిన ప్రాజెక్ట్ 2 (వాల్ పోస్టర్లు) స్టిక్కర్లు ఆదివారం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండలం చిన్నటేకూర్ గ్రామ పంచాయతీలో జనసేన నాయకులు ఆవిష్కరించడం జరిగింది. జనసేన పార్టీ లక్ష్యం అన్నం పెట్టే రైతన్న రాజు కావాలని పంటలకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర కావాలని ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు దురదృష్టవశాత్తు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు బాసటగా ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఈ నెల 8 ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ మండలం రచ్చబండ కార్యక్రమంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 132 కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లూరు మండలము చిన్నటెకూర్ గ్రామం జనసేన పార్టీ పాణ్యం నాయకులు వై. బజార్, సి.హుస్సేన్ పవర్, బి. రంగస్వామి, తిమ్మరాజు, జి. శివ, రాజ్ కుమార్, రాజు జనసైనికులు పాల్గొనడం జరిగింది.