పార్వతీపురం కావాలి మన్యం వద్దు

పార్వతీపురం ప్రాంతాన్ని మన్యం జిల్లాగా ప్రకటించడం పట్ల జనసేన – బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మరియు పార్వతీపురం నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. బాబు పాలూరు మాట్లాడుతూ పార్వతీపురంని కేంద్రంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం కానీ మన్యం జిల్లాగా నామకరణం చెయ్యడం కొంచం బాధగా ఉంది. తినడానికి తిండి లేదు గానీ మీసానికి సంపంగి నూనె కావాలన్నాడట మన జగన్ రెడ్డి లాంటోడు అలా ఉంది ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి. చెప్పుకోవడానికి రాజధాని నిర్మించలేని ఈయన 13 జిల్లాలను 26 చేస్తాడు అంటే ఎవరు నమ్మట్లేదు సమస్యలను డైవర్ట్ చెయ్యడానికి ఇదొక పన్నాగంలా జనసేన పార్టీ భావిస్తోంది అని, అలాగే పార్వతీపురం ప్రాంతంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో ముఖ్య వ్యక్తి శ్రీ ఆదిభట్ల పేరు పెట్టండి లేదా పార్వతీపురం గానే ఉంచండి. అంతే కానీ మన్యం అని మాత్రం వద్దు ఈ విషయంపై అఖిలపక్షము ఏ నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ మద్దతు తప్పకుండా ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు మరియు సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.