పవన్-బాబుల నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం

ఉమ్మడి శ్రీకాకుళం, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు జనసేన జానీ మాట్లాడుతూ జనసేన నాయుకులు, జనసైనికులు మరియు వీరమహిళలు ఈనెల 20 వ తేదీన టీడీపీ యువగళం లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా మొట్ట మొదటి సారిగా జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ విచ్చేయుచున్నారు. కావున మన పాలకొండ నియోజకవర్గం నుండి మరియు శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో జనసైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయవలిసినదిగా కోరుకుంటున్నానని, పవన్-బాబుల నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం మాత్రమేనని తెలిపారు.