నూతన బలిజ సంఘం అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన పెండ్యాల శ్రీలత

రాయలసీమ బలిజ మహాసంఘం నూతన అధ్యక్షులుగా నియమితులైన తొండపునాటి శంకరయ్యని వారి స్వగృహంనందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శంకరయ్య ఆయురారోగ్యాలతో జీవించి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు సేవచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.