చిరంజీవి మురుకుర్తి లోకేష్ ను అభినందించిన అనుశ్రీ సత్యనారాయణ

రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నిర్వహించబడిన 22వ నంది నాటకోత్సవాలలో బాలల నాటికకుగాను విజయవాడ వారి మూడు ప్రశ్నలు బాలల నాటికకు రాజమండ్రి వాస్తవ్యుడు చిరంజీవి మరుకుర్తి లోకేష్ కు నంది అవార్డు రావడం శుభపరిణామమని రాబోవు రోజుల్లో చిరంజీవి లోకేష్ మరెన్నో విజయాలను పొందాలని రాజమండ్రి అర్బన్ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అభినందించారు. భవిష్యత్తులో లోకేష్ కు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని అనుశ్రీ తెలియజేశారు. చిరంజీవి లోకేష్ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, వనజ దంపతులకు అనుశ్రీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు మరియు వంగవీటి ప్రశాంత్ కుమార్, నంగిన శ్రీనులు అభినందనలు తెలిపారు.