కరోనా చర్యలపై ఏపీ హైకోర్టులో పిటిషన్

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చర్యలపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు, తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ మందుల ధరల నియంత్రణపై ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కరోనా బాధితులకు పడకలు అందుబాటులో లేవని, నల్లబజార్‌లో రెమ్‌డెసివిర్‌ విక్రయం జరుగుతోందని పిటిషన్‌లో ప్రస్తావించింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.