పేదల ఇళ్లు తొలగింపు కక్ష సాధింపు చర్య: రాజంపేట జనసేన

రాజంపేట, ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్ళను కూల్చివేయడం కక్ష సాధింపు చర్య అని రాజంపేట జనసేన నాయకులు అన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు శనివారం జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు రైతులు స్థలం ఇచ్చినందునే కక్షతో పేదల ఇళ్లను జెసిబిలతో కూల్చుతున్నారని అన్నారు. ఈ విధానం సరైనది కాదని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన వీర మహిళ జెడ్డా శిరీష, జనసేన నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, వెంకటసుబ్బయ్య, వీరయ్య ఆచారి, శంకరయ్య, గోపి, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.