డిపార్ట్ మెంటల్ ఎగ్జామ్స్ వాయిదా

ఈనెల 25 నుంచి సెప్టెంబరు 1వరకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) తెలిపింది.

కరోనా దృష్ట్యా పరీక్షలు వాయిదా వేస్తున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడించారు.

శాఖాపరమైన పరీక్షలకు 1.75లక్షల మంది దరఖాస్తు చేసుకోగా , అందులో 1.30లక్షల మంది సచివాలయ ఉద్యోగులే ఉన్నారని ఆంజనేయులు తెలిపారు.