ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగా ఉంది: అభిజిత్ ముఖర్జీ

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోవిడ్-19 బారిన పడటంతో ఆయనకు చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10న ఆయనకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించి మొదడులో ఉన్న కణితిని కూడా తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై దేశ వ్యాప్తంగా ఆందోళన కనిపిస్తోంది. ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ డిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయితే ఆయన ఆరోగ్యం విషయంలో దేశ వ్యాప్తంగా అవాస్తవాలు ప్రచారం కావడంతో ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వాస్తవాలను షేర్ చేస్తున్నారు.

తాజాగా ఆయన ఒక పోస్టు షేర్ చేసారు అందులో ” 96  గంటల అబ్జర్వేషన్ పిరియెడ్ నేటితో ముగియనుంది. నా తండ్రి వైటల్ పారామీటర్లు స్టెబుల్ గా ఉన్నాయి. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు. ఈ దేశ ప్రజలకు నేను రుణపడి ఉంటాను అని.. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించండి”  రాశారు.