త్వరలో ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియ

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను వీలయినంత త్వరలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్‌ ఎప్పటి నుంచి ప్రారంభించాలి? వీలయినంత త్వరగా ప్రారంభించడానికి ఏం చేయాలి? అనే విషయాలు చర్చించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉదయం 11గంటలకు ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, రెవెన్యూ , రిజిస్ర్టేషన్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.