రాహుల్ తేవటియా నీకు ధన్యవాదాలు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపియల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్స్ మన్ హిట్టింగ్ చేశారు. అయితే ఈ మ్యాచ్ తో రాహుల్ తేవాటియా ఒక్కసారిగా చాలా ఫేమస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులకు సిక్సర్లు బాదిన తెవాటియా ఐదో బంతిని వదిలేసి.. మళ్లీ చివరి బాల్‌కు ఆరు పరుగులు సాధించడంతో రాజస్థాన్‌ 224 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించగలిగింది. దీంతో టీ20ల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్‌ సింగ్‌ రికార్డు పదిలంగా ఉంది.

ఈ విషయంపైనే ట్విట్టర్‌లో తెవాటియాకు టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సరదాగా ధన్యవాదాలు చెప్పాడు. మిస్టర్ రాహుల్ తేవటియా వద్దు భాయ్ వద్దు, ఆ ఒక్క బంతి వదిలేసినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అద్భుతమైన ఈ మ్యాచ్ లో విజయం సాధించినందుకు గానూ రాజస్థాన్ రాయల్స్ కి కంగ్రాట్స్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ లో మొదటగా తేవటియా పరుగులు తీసేందుకు కాస్త కష్టపడ్డాడు. అయితే శాంసన్ ఔట్ అయిన నెక్స్ట్ ఓవర్ కి తన ప్రతాపాన్ని చూపించారు. అయితే గతంలో యువరాజ్ సింగ్ వరుస సిక్స్ లతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. తేవటియా 31 బంతుల్లో 53 పరుగులు చేయగా అందులో 7 సిక్స్ లు ఉండటం విశేషం.