భక్తులకు అల్పాహారం మరియు మజ్జిగ పంపిణీ చేసిన రాజమహేంద్రవరం జనసేన
రాజమహేంద్రవరం, స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శూలాల పండుగ సందర్భంగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి విన్నా వాసు మరియు పడాల వీర్రాజు వార్ల మిత్రబృందం ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం వరుసగా రెండవ సంవత్సరం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ ఇన్చార్జి వర్యులు అనుశ్రీ సత్యనారాయణ మరియు జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను విచ్చేసి వారి చేతుల మీదుగా భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర కమిటీ ఉపాధ్యక్షులు దాసరి గురునాథం, ప్రధాన కార్యదర్శులు పైడిరాజు, భాషా కార్యదర్శులు అల్లాటీ రాజు, గుణ్ణం శ్యామ్, సంయుక్త కార్యదర్శులు ఫణి, టాగూర్ మరియు జనసేన పార్టీ నాయకులు రాంబాబు, నాగు, గోపి, సురేష్, కుందిరాము, ముంగండ రాజు, వెంకటేష్, సతీష్, శంకర్, జాన్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-18-at-18.11.37-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-18-at-18.11.43-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-18-at-18.11.40-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-18-at-18.11.42-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-18-at-18.11.36-1024x576.jpeg)