జనసేన జనజాగృతి యాత్రలో రాజానగరం జనసేన

  • జనసేన జండా పట్టుకుని ప్రజల్లోకి వెళ్తే చాలు, ఎవరికైనా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు..

రాజానగరం: జనసేన జనజాగృతి యాత్రలో భాగంగా ఇంటింటికి జనసేన కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్ అధ్యక్షతన సీతానగరం మండలం, అచ్చిపాలెం గ్రామంలో జనసేన పార్టీ గాజు గ్లాసు & షణ్ముఖ వ్యూహం కరపత్రలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇళ్లు, ప్రతి మనిషి లో మార్పు రావాలని ఈ జన జాగృతి యాత్ర ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల కో-కన్వీనర్ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరామహిళ కందికట్ల అరుణ కుమారి, సీతానగరం మండలం ప్రధాన కార్యదర్శి & దళిత నాయకులు చిడిపి నాగేష్, శ్రీను సానపల్లి, రఘు, మరియు అచ్చిపాలెం గ్రామ జనసేన పార్టీ నాయకులు జి. రవి, జి. హరికృష్ణ, పి రాజేష్, జె శ్రీను, పి రాంబాబు, ఎం. నాగేంద్ర, పి సురేష్, జనసైనికులు, జనసేన పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.