కోల్ కతాపై బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో కీలక పోరు జరగుతోంది. దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్ రాయల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రాయల్స్ ఆరింట్లో విజయం సాధించచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇక కోల్‌కతా కూడా 13 మ్యాచ్‌లకిగానూ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొంది నెట్ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా ఏడో స్థానంలో ఉంది. రెండు జట్లు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.