రాజస్థాన్ Vs పంజాబ్‌

ఐపీఎల్ లో షార్జా వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 9వ మ్యాచ్. గత మ్యాచ్ లో విజయం సాధించిన ఉత్సహంతో రెండు జట్లు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. అయితే పంజాబ్ జట్టుకు ఇది మూడో మ్యాచ్. మొదటి మ్యాచ్ ఢిల్లీ పై అంపైర్ తప్పిదం కారణంగా ఓడిపోయిన ఈ జట్టు తర్వాత రెండో మ్యాచ్ లో ఆర్సీబీ పై 97 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో సెంచరీ తో మంచి ఫామ్ లో ఉన్నాడు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్. . రాజస్థాన్ విషయానికి వస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్, వికెట్ కీపర్ సంజూ సాంసన్ మంచి ఫామ్ లో ఉన్నారు. గత మ్యాచ్​ల్లో గెలిచిన ఇరు జట్లు ఇందులోనూ విజయం సాధించాలని బరిలోకి దిగారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే విజయోత్సాహంతో ఈ మ్యాచ్ లో పాల్గొంటున్న ఈ జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది చూడాలి.