రంగా గారి సేవలు చిరస్మరణీయం: మలికిపురం ఎంపిపి

వంగవీటి మోహన్ రంగా 33 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మలికిపురం ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి వంగవీటి మోహన్ రంగాకి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీమతి వాణి మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలకు వంగవీటి మోహన్ రంగా చేసిన సేవలు అభినందనీయమని ఆయన తిరుగులేని నాయకుడని రంగా గారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కే. శ్రీను, వైస్ ప్రెసిడెంట్ గంగన్న గ్రామ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.