KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ప్రజలతో శ్రీమతి వినుత

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మరియు జనసేన పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా రేణిగుంట పట్టణంలోని వేణుగోపాలపురంలో పర్యటించి అక్కడి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీ, పారిశుధ్యం, స్ట్రీట్ లైట్స్ సమస్యలను వినుత దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజల సమస్యలను మండల అధికారుల, జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే దిశగా జనసేన అధికారులపై ఒత్తిడి తెస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.