రేషన్​ కార్డు ఈ– కేవైసీ గడవు పెంచాలి: జనసేన డిమాండ్

  • ప్రతి హాస్టల్ లో క్యాంపు నిర్వహించాలి

ముధోల్: గురువారంతో ముగియనున్న రేషన్ ఈ కేవైసీ గడువు ను వెంటనే పెంచాలని కోరుతూ జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేయడం జరుగుతుంది. అసలే పేద మధ్య తరగతి కుటుంబాలకు రేషన్ చాలా కీలకమైనది. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు జత చేసింది చాలా మంది ప్రజలు రేషన్ షాపుల్లో వేలి ముద్రలు వేశారు. కాని కొంత మంది పిల్లలు హాస్టల్ కి పంపడం ద్వారా ఇలా అనేక అనివార్య కారణాల వల్ల ఈ కేవైసీ చేయించుకొలేక పోయారు. ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లల వేలి ముద్రలు, కళ్ళు పడక పోవడం వల్ల రేషన్ కట్ అయితే మళ్ళీ బియ్యం రావనే ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రతి హాస్టల్ లో క్యాంప్ నిర్వహించి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నామని మహేష్ బాబు తెలిపారు.