రామసముద్రం గ్రామంలో జనసేనలో చేరిన యువత

నగరి: వడమాలపేట మండలంలో ఉన్న రామసముద్రం గ్రామంలో నివసిస్తున్న యువకులు, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నగరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి మెరుపుల మహేష్ మరియు మండల అధ్యక్షుడు ముని శేఖర్ యాదవ్ అధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని జనసైనికులు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరి రూరల్ అధ్యక్షుడు దేవ మరియు మండల ఉపాద్యక్షుడు మేర్లపాకు చక్రవర్తి, కుమార్, శేషాద్రి మరియు వీరమహిళలు జనసైనికులు పాల్గొనటం జరిగింది.