ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సంపత్ నాయక్

తెలంగాణ, వైరా నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సంపత్ నాయక్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పత్రికాముఖంగా మాట్లాడుతూ చదువుఖోనోడు, చదువు విలువ తెలియని వాడు రాజకీయం చేస్తే వచ్చేవి ఉద్యోగాలు కాదు తిరుగుబాట్లు. నాడు పెత్తందారీ దోపిడీ పాలనతో విసిగి స్వరాష్ట్ర సాధనకై ఎందరో తనువులు చాలించగా… నేడు చేతకాని నిర్లక్ష్యపు అసమర్థ పాలనలో కొలువలకై కొట్లాడి బలవుతున్న నిరుద్యోగులు ఎందరో. రాచరికపు అవినీతి ముసుగులో మీరు ఆడే వికృత క్రీడకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని, మాకు కావాల్సింది మీరు చెప్పిన (నీళ్ళు – నిధులు) కాదని, అమ్ముడుపోని విద్యతో కూడిన నియామకాలు, ఆత్మగౌరవంతో కూడిన రాజ్యాధికారం, ఖర్చు లేని వైద్యం, నిజమైన ఉపాధి అని, చదువు కోసం, చదువుతో పోరాడి, చదువు ఒడిలో నేలకొరిగిన విధ్యాకుసుమానికి నా కన్నీటి వీడ్కోలు అంటూ ప్రవల్లికకు నివాళులు అర్పించారు.