బొబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.. విజేతలకు బహుమతుల ప్రధానం

  • గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం, తిరుమలమ్మపాలెం గ్రామంలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు శుక్రవారం బహుమతులను ప్రధానం చేశారు. మొదటి బహుమతిగా గంగాళం, రెండో బహుమతిగా స్టీల్ బిందె, మూడవ బహుమతిగా స్టీల్ టిఫిన్ తోపాటు ముగ్గుల పోటీలలో పాల్గొన్నవారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అదే విధంగా తిరుమలమ్మపాలెం గ్రామానికి ఎప్పటినుంచో కలగా ఉన్నటువంటి బ్రిడ్జి వరదలు వచ్చినప్పుడు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలుపొంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఆ తక్షణమే తిరుమలమ్మపాలెం బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో కొనసాగించడానికి అడుగులు ముందుకు వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీహరి, పినిశెట్టి మల్లికార్జున్, షేక్ రహీం, ఆస్తోటి రవి, షేక్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.