సోనూసూద్ ఇంటిపై రెండో రోజు ఐటీ రైడ్స్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంటిపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. సోనూసూద్ ఇటీవల లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆదాయ పన్ను ఎగవేతకు ఇష్యూలో సోనూసూద్ ఇండ్లు, కార్యాలయాలపై ఏకంగా 20గంటల పాటు సోదాలు నిర్వహించారు. మరోవైపు సోనూసూద్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిసినందుకే ఈ సోదాలు జరుగుతున్నట్లు రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. సోనూసూద్ పై ఐటీ రైడ్స్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలకు అండగా ఉన్న సోనూసూద్ పై రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.