తెలంగాణలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి తిరిగి మొదలవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా నిలచిపోయిన టీకా పంపిణీ ప్రారంభిచాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించాలన్నారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగినవారు దగ్గరలో ఉన్న ప్రభుత్వ వాక్యినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అలాగే, సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ నిర్వహించాలని అన్నారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.