జనసేనలో చేరిన వైసిపి సీనియర్ నాయకులు మండేల శ్రీనువాస్

ఆచంట: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ఆచంట నియోజకవర్గ ఇన్చార్జ్ చేగొండి సూర్య ప్రకాష్ సమక్షంలో మండల ప్రెసిడెంట్ జవ్వాది బాలాజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు ఆచంట టౌన్ ప్రెసిడెంట్ నంబూరి విజయ్ అధ్యక్షతన వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు మరియు కాపునాడు జిల్లా అధ్యక్షులు మండేల శ్రీనువాస్ జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీని ఆచంటలో మరింత బలోపేతం దిశగా పనిచేస్తానని శ్రీనివాస్ తెలియజేశారు. పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంగలదాస్ దానయ్య, వైస్ ఎంపీపీ ఎర్రగుప్పుల నాగరాజు, పోడూరు మండల అధ్యక్షులు రావి హరీష్ బాబు, పెనుగొండ మండల ప్రధాన కార్యదర్శి మంద నవీన్, ఆచంట మండల ప్రధాన కార్యదర్శి నిమ్మన వీర శేఖర్, మండల కార్యదర్శి కుంపట్ల సత్యనారాయణ, కోడేరు గ్రామ అధ్యక్షులు కుంపట్ల రమేష్, ఆచంట గ్రామ ప్రధాన కార్యదర్శి పీతాని లక్ష్మణ్, జనసేన నాయకులు బెల్లంకొండ ఈశ్వర్, మాతంశెట్టి శ్రీనివాస్, సింగంశెట్టి నాగేశ్వరరావు, దమ్మ వాసు మరియు తదితరులు పాల్గొన్నారు.