కేదారిపురం రోడ్డు దుస్థితిపై జనసేన వినతి పత్రం

ఇచ్చాపురం మండలం, ముచ్చంద్ర బెనిగని పేట, కేదారిపురం రహదారిలో రోడ్డు అద్వానంగా ఉండడంతో ఈ రోడ్డు పై ప్రయాణించడానికి ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను తెలుసుకొన్న జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ, ఇచ్చాపురం ఎంపీడీవోకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా.. గత మూడున్నర సంవత్సరాలు కాలంగా ఈ రోడ్డు ఇలానే ఉంది, పట్టించుకునే నాధుడే కరువైపోయారు. ఒకవైపు గర్భవతులు, మరోవైపు స్కూల్ పిల్లలు, ఉపాధి కూలీల వాహనాలు ప్రయాణించడానికి చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి మా మీద దయ ఉంచి గోతులు పూడుస్తారని కోరుకుంటున్నాం అని వినతి పత్రం ద్వారా సమస్యను అదికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి సాడి శంకర్ రెడ్డి, మాధవరెడ్డి, కేదార్పురం జనసైనికులు పాల్గొన్నారు.