జనసేన నగర ప్రధాన కార్యదర్శిగా షేక్ భాషా లిమ్రా

రాజమహేంద్రవరం, జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాదర్శిగా షేక్ భాషా లిమ్రా నియమితులయ్యారు. జనసేన పార్టీకి సంబంధించి నగర కమిటీని జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ప్రకటించటం జరిగింది. అందులో భాగంగా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న షేక్ భాషా లిమ్రాను రాజమహేంద్రవరం నగర ప్రధాన కార్యాదర్శిగా నియమించటం జరిగింది. షేక్ భాషా లిమ్రాను ప్రధాన కార్యదర్శిగా నియమించటంపట్ల పలువురు మైనారిటీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు హర్షం వ్యక్తంచేసారు. ఈ సందర్భంగా షేక్ భాషా లిమ్రా మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జనసేన రాష్ట్రంలో మైనారీటిలకు అండగా ఉందని, మరింత అంకిత భావంతో పనిచేస్తూ, పార్టీని నగరంలో మరింత బలోపేతం చేయటానికి కృషి చేస్తానని తెలియజేసారు. తనకు ఈ అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్, నగర ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణలకు షేక్ భాషా లిమ్రా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.