అంగన్వాడిలకు భోజన సదుపాయాలను సమకూర్చిన శెట్టిబత్తుల

అమలాపురం: అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత 8 రోజులుగా స్థానిక అమలాపురం, ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట మంగళవారం అంగన్ వాడీ వర్కర్ల వంటావార్పు కార్యక్రమంలో జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పాల్గొని వారికి భోజన వసతి సమకూర్చటం జరిగింది. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను ప్రభుత్వం నెరవేర్చే వరకు వారు చేస్తున్న పోరాటానికి జనసేనపార్టీ మద్దతు ఉంటుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధానకార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కార్యదర్శి చిక్కాల సతీష్, కౌన్సిలర్లు గండి దేవి హారిక, గోలకోటి విజయలక్ష్మీ పార్టీ నాయకులు గండి స్వామి, ఆకుల బుజ్జి, పొణకల ప్రకాష్, ముత్తాబత్తుల శ్రీను, మోకా బాలయోగి, గుమ్మళ్ల తాతయ్య కాపు, అర్లపల్లి దుర్గ, గోలకోటి వాసు, వంగా నాయుడు, వర్రే సూరిబాబు, ఈతకోట రవినాని, అయితాబత్తుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.