నరసాపురం నియోజకవర్గం: నరసాపురం మండలం, మల్లవరం ఎంపీటీసీ, ఇంజేటీ మేరీ రత్నం వైస్సార్సీపీ పార్టీని వీడారు. ఆదివారం నరసాపురం పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఎంపీటీసీ మేరీరత్నంతో పాటు గ్రామంలోని పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన పలువురుకి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు ఆకన చంద్రశేఖర్, వలవల నాని, మైల వసంతరావు, నిప్పులేటి తారక రామారావు, బందేల రవీంద్ర, వల్లభ రెడ్డి రామకోటి, జడ్డు మల్లికార్జునరావు మరియు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, వీర, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment