చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేసిన సింగరాయకొండ జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సలహాల మేరకు.. సింగరాయకొండ ట్రంక్ రోడ్డు లోనీ జనసేన పార్టీ అధ్వరంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చలివేంద్రంలో ఆరువారాలుగా.. మండువేసవిలో ప్రయాణికులకు, బాటసారులకు, యాచకులకు మరియు ప్రజలకు దాహార్తి తీర్చడానికి ప్రతీ రోజు చల్లని మినరల్ వాటర్, మరియు ప్రతి ఆదివారం చల్లని మజ్జిగ జనసేన పార్టీ తరుపున అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, కోలపర్తి శ్రీధర్, దండే ఆంజనేయులు, దేవినేని బాలాజీ, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా భాష, షేక్ సుల్తాన్ బాషా, చలంచర్ల కరుణ్ కుమార్, షేక్ సుభాని, షరీఫ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.