ఛలో కొండగట్టు పోస్టర్ ఆవిష్కరించిన సిరిసిల్ల జనసేన నాయకులు

సిరిసిల్ల: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనవరి 24వ తేదీన ఎన్నికల ప్రచార రధం వారాహి పూజ కోసం కొండగట్టుకు మరియు ధర్మపురి దేవాలయాలకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో జనసేన పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు ఛలో కొండగట్టు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ యాత్రలో జనసేన కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పాల్గొని యాత్రని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు మహేష్ పెంటల, జిల్లా నాయకులు ఎలగొండ సాయి కృష్ణ, గుంటుక రవికాంత, ముద్రకొండ హరికృష్ణ అల్లె శ్రీకాంత, జిల్లా విద్యార్థి నాయకులు చిప్ప సాయి నియోజకవర్గ నాయకులు, నూర నరేష్, సబ్బాని నారాయణ, సందిరి శ్రీకాంత్, ద్యావనపల్లి లవన్, అజ్మీర్ సాయి ప్రసాద్, దుంపల్లి శ్రీకాంత్, తుంగ రాహుల్, లాగిశెట్టి శ్యామ్ మారుతి ,పండుగ అనిల్ తదితరులు పాల్గొన్నారు.