కాకినాడ జనసేన ఆధ్వర్యంలో వారాహి వాహనం కోసం ప్రత్యేక పూజలు

కాకినాడ సిటీ: కొణిదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వారహి మొదటి పూజా కార్యక్రమం విజయవంతంగా జరగాలని శ్రీ ఆంజనేయస్వామి కోరుకుంటూ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశం మేరకు మంగళవారం ఉదయం 21వ డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విష్ణు ఆలయం వీధిలో ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 21 డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వారాహితో జనసేన ప్రజా యాత్ర విజయవంతంగా జరగాలని, ఆ అంజనీపుత్రుడు అయిన ఆంజనేయ స్వామి వారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 21 డివిజన్ కమిటీ సభ్యులు తులసి, సత్తి రాజు, గుర్రాల సతీష్, మణీశ్వరరావు, గ్రంధి నాని, దుర్గారావు, వీర మహిళలు పాల్గొన్నారు.