యువన్ చాణక్య పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ

  • సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులకు ప్రశంస

జనగామ: మాతాంగి రఘు, స్రవంత్రి కుమారుడైన యువన్ చాణక్య పుట్టినరోజు సందర్భంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని, వర్ధన్ అనాధాశ్రమంలో అన్నదానం మరియు పండ్లు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నీరేటి రవి జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, నరేంద్ర పవన్, శివ, నరేష్, ఎల్లేష్, గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.