Pithapuram: కందుల దుర్గేష్ త్వరగా కోలుకోవాలని లివింగ్ జీసస్ క్రిస్ట్ ప్లేయర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

తూర్పుగోదావరిజిల్లా పిఠాపురం నియోజవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాదులో గల లివింగ్ జీసస్ క్రిస్ట్ ప్లేయర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిఠాపురం జనసేనపార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆదేశానుసారం తూర్పుగోదావరిజిల్లా రథసారధి జనసేనపార్టీ అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని ఆ ఏసు ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకా కొండబాబు, మైలపల్లి దావీదు, మెరుగు ఇశ్రాయేలు, ఆర్ నాగేశ్వరరావు, మైలపల్లి రాజు, రాసి పిల్లి నాగేశ్వరరావు, బడే మహేను, కొడ బాలు, సోదే ప్రేమ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.