జనసేనాని త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

చీరాల: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడై, శక్తివంతుడుగా తిరిగి రావాలని కోరుతూ చీరాల నియోజకవర్గం, వేటపాలెం మండల అధ్యక్షులు ఉగ్గీరాల మర్ఖండేయులు ఆధ్వర్యంలో పందిళ్లపల్లి లోని పందిళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో, వేటపాలెం లోని శ్రీ స్వయంభూ గణపతి ఆలయంలో, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద అభిషేకం చేయించడం జరిగినది. ఆ పందిళ్ళమ్మా తల్లీ, గణనాధుని, వెంకటేశ్వర స్వామి వార్ల ఆశీస్సులు ఎల్లవేళలా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి జనసేన కార్యకర్తలు పూజ చెయ్యడం జరిగినది.

ఈ కార్యక్రమంలో పృథ్వీ శ్రీహరీ, పింజల సంతోష్, పవనన్న చేనేత బాట కార్యక్రమ నిర్వహణ నాయకుడు కర్ణ కిరణ్ తేజ్, పసుపులేటి సాయి, నాగార్జున కోయిసేరీ, రత్నాకర్, సుభ్రమణ్యం, కృష్ణ, శ్రీనివాసరావు, కరిం సాయి, తోట చక్రి మరియు భూపతి మనోజ్ పాల్గొనడం జరిగింది.