పట్టణంలో జనసేనకు విశేష స్పందన: మాకినీడి శేషుకుమారి

పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే కార్యక్రమంలో భాగంగా 4వ రోజు పిఠాపురం పట్టణం 1వ వార్డ్ పశువుల సంత నుండి ప్రారంభం అయింది. స్థానిక కార్యకర్తలు, నాయకులు సహకారంతో శేషుకుమారి ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మరియు సమస్యల పరిష్కారానికై పవనన్నకు ఓటు వేసి జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గడపగడపకు వెళ్తుంటే మేము వివరించకుండానే మా ఓటు జనసేనకే అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా విశేష స్పందన లభిస్తుందని, ఈసారి కచ్చితంగా జనసేన పార్టీ విజయకాతనం ఎగురవేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమనికి సహకరించిన పిఠాపురం పట్టణ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్ ,పిఠాపురం పట్టణ ప్రెసిడెంట్ బుర్రా సూర్యప్రకాశరావు, మహిళ ప్రెసిడెంట్ కోలా దుర్గ,గౌరవ అధ్యక్షులు కర్రీ కాశీ విశ్వనాథ్, అల్లం కిషోర్, పిట్టా చిన్న, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, గోపు సురేష్, వేల్పుల చక్రధర్, బొజ్జ కుమార్, కసిరెడ్డి నాగేశ్వరరావు, పెద్దిరెడ్ల భీమేశ్వరరావు, మైనా బత్తుల చిన్న, గరగ బాబి, నామ శ్రీకాంత్, పబ్బినీడి దుర్గాప్రసాద్, గంటా బాబి, గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్, మొగలి శ్రీను, రెడ్డి మనోహర్, అప్పన్న, మహేష్, నందు, నాగరాజు, గంజి సురేష్, బెల్లంకొండ బాబి, బావిశెట్టి వినయ్, పసుపులేటి గణేష్, బెల్లంకొండ వీరభద్రరావు, జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.