ఎన్నికల ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి: బాబు పాలూరు

బొబ్బిలి, కేవలం అమ్మ ఒడి పథకం బటన్ నొక్కడం కోసం సుమారు 2 నుంచి 3 కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చు పెడుతూ కురుపాం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం హాస్యాస్పదమని, ఈ డబ్బుతో కొన్ని గ్రామాలకు తాగునీరు అందించొచ్చు, గిరిజన వసతుల్లో మౌళిక సదుపాయాలు కల్పించొచ్చని, అసలేం ప్రగతి సాధించారని పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గంలోకి వస్తున్నారు? గిరిజన ప్రాంత అభివృద్ధికి ఏం చేసారో స్పష్టత లేదు. పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం ఎందుకు పూర్తి చెయ్యలేకపోయారో చెప్పాలని, ఏనుగుల సమస్యకు పరిష్కారం ఎందుకు చూపలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వెనుకబడిన కురుపాం నియోజకవర్గానికి ఈ నాలుగేళ్లలో ఏం చేసారో చెప్పాలని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ముఖ్యమంత్రి జగన్ కు ప్రశ్నల వర్షం గుప్పించారు.