వ్యవసాయ చట్టాల అమలు ఆపాలన్న సుప్రీంకోర్టు

కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ చట్టాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులు వ్యతిరేకిస్తున్న నూతన వ్యవసాయ చట్టాల అమలును ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అయితే వ్యవసాయ చట్టాల అమలును ఆపడం జరిగే పనికాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనికి చీఫ్ జస్టిస్ దయచేసి పరిశీలించాలని.. ఈలోగా రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు.

రైతు సంఘాలు కోర్టుకు హాజరు కాకపోవడంతో వారికి ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. ‘వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయడానికి అవకాశాలను పరిశీలించాలని’ కేంద్రానికి సూచించారు.

తదుపరి విచారణ వింటర్ వెకేషన్ లో జరుగుతుందని తెలిపారు. వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించేందుకు పిటీషనర్లకు అవకాశం కల్పించారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతం అవుతోంది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపినా ఫలించడంలేదు. దీంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని వ్యవసాయ చట్టాల అమలు ఆపాలని కేంద్రాన్ని కోరింది.