అక్రమ ఇసుక రవాణాను ఆపండి.. తాసిల్దార్ కి జనసేన వినతి పత్రం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, ముక్కర వారి పల్లి పంచాయతీ, ముక్కర వారి పల్లి మరియు టి.టి కండ్రిగ గ్రామం మధ్యలో ఉన్న బ్రిడ్జి వద్ద గత రెండు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పేరిట జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే, ముక్కర వారి పల్లి గ్రామస్తులు, మరియు టీటీ కండ్రికి గ్రామస్తులతో కలిసి జనసేన ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తామని కార్వేటి నగరం డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం సమర్పించిన జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల బూత్ కన్వీనర్ అన్నామలై పాల్గొన్నారు.